బండ్ల గణేష్.. తెలుగు ప్రజానికానికి బాగా సుపరిచితమైన పేరు. నిత్యం ఏదోక వివాదాస్పదంతో వార్తల్లో నిలిచే ఈయనే మళ్ళీ మరోసారి వార్తల్లోకి ఎక్కడు. కాకపోతే ఈ సారి దీనికి సంబంధించిన కారణం మాత్రం కొంచం విచిత్రంగా ఉంది. తాను దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్ మీద ఆయన కొంచం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తీరుపట్ల ఒకింత అసంతృప్తిగా కూడా ఉన్నట్టు సమాచారం. అసలు దీనికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం..

 

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకొని మహమ్మారిని జయించిన ఆయన.. తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. దీంతో మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసియడం మొదలుపెట్టారు. “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో అనవసరంగా నటించానని చెప్పి మహేశ్ బాబు ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన బండ్ల గణేష్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా కోపం తెప్పిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తనకు కరోనా వచ్చిన సమయంలో ఇండస్ట్రీలోని చిన్న, పెద్ద అందరూ ఆయనకి ఫోన్ చేసి పరామర్శించారట. ఆఖరికి తాను ఇష్టపడని కొందరు వ్యక్తులు కూడా ఆయనని పరామర్శించారట. చిరంజీవి, బాలకృష్ణ, మొదలుకుని, చిన్న స్థాయి తారలవరకు అందరూ పరామర్శించినట్టు ఆయన చెప్తున్నారట.

 

అయితే తాను దేవుడిగా పూజించే పవన్ కళ్యాణ్ మాత్రం ఫోన్ చేయలేదని.. కనీసం తన క్షేమ సమాచారాల గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదని బండ్ల గణేష్ బాధపడ్డట్టు సమాచారం. బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు నిర్మించాడు. అప్పటి నుంచి వీరి బంధం మరింత బలపడింది. అందుకే తన ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని దాన్ని పూజిస్తుంటారు బండ్ల. తాను అంతగా అభిమానించే పవన్ కళ్యాణ్ తనని పరామర్శించకపోయేసరికి బండ్ల చాలా బాధపడ్డారట. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పవన్ తనని అసలు పట్టించుకోవట్లేదాని, అలాంటి వ్యతికి ఇంత గౌరవం ఇవ్వడం దండగ అని ఆయన స్నేహితులతో చెప్పినట్టు సమాచారం. దీంతో పవన్ అభిమానులు కూడా బండ్ల చేసిన వ్యాఖ్యలపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: