హైదరాబాద్ లోని పాతబస్తీలో ఘరానా మోసం వెలుగులోకొచ్చింది.పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులిస్తామంటూ చెప్పి కుచ్చుటోపీ పెట్టారు ఓ దంపతులు.బాధితుల వద్ద నుంచి ఏకంగా తొమ్మిది కోట్లు వసూలు చేశారు. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో ఒక్కొక్కరు లక్ష రూపాయల నుండి 90 లక్షల వరకూ సమర్పించుకున్నారు. 



భుస్రా, సిరాజ్ అనే దంపతులు పెట్టుబడి పెట్టిన డబ్బులకు రెట్టింపు ఇస్తామని ఆశ చూపారు.దీంతో సుమారు వంద మంది వరకూ పెట్టుబడి పెట్టారు. అనంతరం కట్టిన డబ్బులు అడిగేందుకు వెల్లిన బాధితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో మోస పోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.దీంతో స్పందించిన పోలీసులు బాధితుల దగ్గర నుంచి వివరాలు సేకరించి,కేసు నమోదు చేసి,దర్యాప్తుచేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: