ప్రకృతిలో జీవించాలి..ప్రకృతితో మమేకం అయ్యి బ్రతకాలి..దేశానికి ఎంతో ముఖ్యమైన పాడి పంటలు కాపాడటంలో నేను కూడా ఒకే ముఖ్య భూమిక పోషించాలి అనుకునే వారికి ఎంతో మంచి వార్త..ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2018-19కి గాను వర్సిటీ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
డిప్లొమా కోర్సులు:
వ్యవసాయం(రెండేళ్లు)
విత్తన సాంకేతిక పరిజ్ఞానం(రెండేళ్లు)
అగ్రికల్చరల్ ఇంజినీరింగ్(మూడేళ్లు)
మొత్తం సీట్ల సంఖ్య: 1020(ప్రభుత్వ-390, ప్రైవేటు-630).
అర్హత: పదోతరగతి
ఉత్తీర్ణత. ఇంటర్, అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న వారు అర్హులు కారు.
వయసు: డిసెంబర్ 31, 2018 నాటికి 15-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : అకడమిక్ మెరిట్
ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ పద్ధతిలో.
ఆన్లైన్ దరఖాస్తుకు
చివరితేదీ: జూన్ 18, 2018.
మరిన్ని వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.pjtsau.ac.in