తన కూతురిని మైనార్టీ గురుకుల పాఠశాలలో చేరుస్తానని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
మధ్యతరగతి వారు కూడా, తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదవడాన్ని స్టేటస్ సింబల్గా భావించే ఈ రోజుల్లో తన కూతురిని ప్రభుత్వ హాస్టల్ లో చేర్పించాలనుకుంటున్న ఆమె నిర్ణయం స్ఫూర్తిదాయకమని తెలంగాణ మైనార్టీ గురుకులాల (టీఎమ్ఆర్ఈఐఎస్)కార్యదర్శి షఫీయుల్లా ప్రశంసిస్తూ, మీడియా నోట్ విడుదల చేశారు.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, ప్రజల పన్నుల నుండి జీతం పొందుతున్న ఉద్యోగులు తమ పిల్లలను సర్కారీ బడులకు పంపినపుడే, ఆ స్కూల్కి విలువు పెరుగుతుందని విద్యానిపుణులు అంటుంటారు. దీనిని ఆదర్శంగా తీసుకొని, వికారాబాద్ కలెక్టర్ తన కూతురు తాబిష్ రైనాను టీఎంఆర్ వికారాబాద్ బాలికల పాఠశాల-1లో చేర్పించాలని నిర్ణయించారు.
మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అందించేందుకు టీఎమ్ఆర్ఈఐఎస్ ఎంతగానో క షి చేస్తోంది. సంప్రదాయ బోధనా పద్ధతులు అవలంబిస్తూనే.. వారిని ప్రొఫెషనల్స్గా తీర్చిదిద్దేందుకు నిరంతరం పాటుపడుతోంది..