ఇంటర్
తరువాతా విద్యార్ధులు అధికంగా ఎంచుకుంటున్న మార్గం JEE. ఎంతో మంది JEE నోటిఫికేషన్
కోసం ఎదురు చూస్తూ కసరత్తులు చేస్తున్నారు. JEE mains కి ప్రేపైర్ అయ్యేవారి కోసం ధరఖాస్తులు
ప్రక్రియ మొదలు పెట్టింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. గతంలో ప్రకటించినట్టుగా కాకుండా సెప్టెంబర్ 3న ఈ ప్రక్రియ
ప్రారంభించింది.
వచ్చే సంవత్సర అకడమిక్ సీజన్ కంటే ముందుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు సార్లు జెఈఈ మెయిన్స్ నిర్వహిస్తుంది. మొదటి జెఈఈ మెయిన్స్ 2020 జనవరిలో రెండవ జెఈఈ మెయిన్స్ ఏప్రియల్ లో ఉంటాయి. ఈ రెండు పరీక్షలకి ఒకే అభ్యర్ధి హాజరు కావచ్చు. ఏ కాలంలో రాసిన పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అడ్మిషన్ లో పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ -3 -2019
దరఖాస్తు ఆఖరుతేదీ : సెప్టెంబర్ -30 -2019
జెఈఈ మెయిన్స్ 2020 పరీక్ష జనవరి 6 – 11 వరకూ ఉంటుంది.
ఫలితాల విడుదల తేదీ : జనవరి -31 -2020
ఈ వెబ్సైటు లో దరఖాస్తు అప్ప్లై చేసుకోవచ్చు - jeemain.nic.in