సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే(SCR ) స్కిల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని తెలిపింది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది అని అధికారులు తెలిపారు.


పోస్ట్ కి సంబంధించి అర్హత‌ వివరాలకు వస్తే  50 శాతం మార్కులతో ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత‌ కచ్చితంగా ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి అని తెలియచేసింది. ఇక ద‌ర‌ఖాస్తు వయసు పరిమితి  08.12.2019 నాటికి 15-24 సంవత్సరాల మ‌ధ్య కచ్చితంగా  ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు కూడా వర్తిస్తాయి అని అధికారులు తెలిపారు. ఈ పోస్టుకి వివిధ అర్హత వివిధ డిపార్ట్మెంట్ వారికీ  ద‌ర‌ఖాస్తు కూడా చేసుకోవచ్చు. సంబంధిత వివరాలు వెబ్ సైట్ లో తెలియచేయడం జరిగింది.


ఇక ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుకి  ఎంపిక విధానం అక‌డ‌మిక్ మెరిట్, మెడిక‌ల్ ఫిట్‌నెస్‌, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌ ఆధారంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన దరఖాస్తు ఫీజు మాత్రం  రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కూడా ఉండడం గమనార్థకం.


ఇక ద‌ర‌ఖాస్తుకు  ముఖ్యమైన తేదీలు..  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 09.11.2019 , ఇక  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది  08.12.2019  లోపు చేసుకోవాలి అని తెలిపింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్  బాగా చదివి నిబంధలు ప్రకారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. మొత్తం 4103 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం పలుకుతుంది. పూర్తి  వివరాలకు సంబంధింత వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా  కోరడం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: