తెలంగాణలో గురుకుల పాఠశాలలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. వీటికి పోటీ విపరీతంగా పెరిగింది. వీటిలో సీటు సాధిస్తే ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అందులోనూ ఇక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో సీటు సంపాదిస్తే.. ఇక భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని గత ఫలితాలు నిరూపిస్తున్నాయ.

 

అందుకే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటారు. తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు గురుకుల సొసైటీ ప్రకటన విడుదల చేసింది. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ కళాశాలల్లో 2020-2021 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తుల్ని ఆహ్వానించింది.

 

ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో సీటు సంపాదించిన వారికి ఇంటర్ విద్యతో పాటు నీట్, ఎంసెట్, వంటి అత్యున్నత విద్య కోసం కోచింగ్ కూడా దొరుకుతుంది. ఇక్కడకు వచ్చేది అంతా మెరిట్ స్టూడెంట్లే కాబట్టి.. చక్కటి పోటీ ఉంటుంది. ప్రభుత్వం కూడా చక్కటి విద్యావకాశాలు కల్పిస్తోంది.

 

అందుకే ఈ సమాచారం మీకు ఉపయోగపడకపోయినా.. మీకు తెలిసిన వారికి అందించండి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.tswreis.in, www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌ పరిశీలించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: