చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సదరన్ రైల్వే స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. భారీ సంఖ్యలో వివిధ వర్క్షాప్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. . ఇక అర్హత పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అని రైల్వే సంస్థ తెలియచేయడం జరిగింది. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 1 నుంచి 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రైల్వే సంస్థ తెలియచేయడం జరిగింది.
ఇక పోస్టుల వివరాలు తెలుసుకుందామా మరి..అప్రెంటిస్ పోస్టులు కలవు. నోటిఫికేషన్ మొత్తానికి మొత్తం ఖాళీల సంఖ్య: 3,585 . ఈ మొత్తం పోస్ట్లు వివిధ విభాగాలలో వివిధ పోస్ట్లు ఉన్నాయి. వాటి వివరాలు ఇలా...
.
- క్యారేజ్ వర్క్స్ (పెరంబూర్): 1208
- సెంట్రల్ వర్క్షాప్ (గోల్డెన్ రాక్): 723
- సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ వర్క్షాప్ (పొడనూర్): 1654
పైన తెలిపిన పోస్టుల ఆంటీకి కూడా పోస్టుల అన్నిటికీ కూడా సంబంధింత అర్హత విషయానికి వస్తే 10+2 విధానంలో పదోతరగతి లేదా తత్సమాన విద్య అర్హత కచ్చితంగా ఉండాలి. ఇంకా సంబంధిత విభాగంలో ఐటీఐ విద్య కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి. ఎంఎల్టీ పోస్టులకు ఇంటర్ (బైపీసీ) చదివి ఉండాలి. ఇక దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు అవకాశం కూడా ఉంది. ఇక వయసు వయోపరిమితి మాత్రం 15 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఎంఎల్టీ పోస్టులకు మాత్రం 24 సంవత్సరాల వరకు అవకాశం లభించడం జరిగింది రైల్వే సంస్థ.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదలగు తేదీ: 01.12.2019.
* ఆన్లైన్ దరఖాస్తుకు చేసుకోవడానికి చివరితేది: 31.12.2019 (సా.5.00 గం వరుకు)
ఆసక్తి అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్లో పూర్తి వివరాలు చదివి అప్లై చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము.