ప్రభుత్వ ఆదేశాలను, అధికారుల సూచనలను కొన్ని కార్పొరేట్, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.  నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్‌ ఇస్తున్నారు వారిపై  బోర్డు అధికారులు కూడా  తనిఖీలు చేయడం లేదు. ఇందుకు నిదర్శనం గాయత్రి ఏస్టేట్‌లోని నారాయణ జూనియర్‌ కాలేజీలో కోచింగ్‌ ఇస్తుండటమే . దీంతో  ఇటీవల కోచింగ్‌ తరగతులను  లక్ష్మీనగర్‌లోని ఓ నూతన భవనంలోకి  మార్చారు. ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీ  కూడా  ఈద్గా సమీపంలో తరగతులు నిర్వహిస్తోంది. మిగిలిన కార్పొరేట్‌ కాలేజీల్లో తరగతులతో పాటే పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్‌ బోర్డు అధికారులు పట్టనట్ల వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.  


 ఇప్పటికి 266 ఇంటర్మీడియట్‌ కాలేజీలు జిల్లాలో ఉండగా వీటిలో 226 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో 18  కార్పొరేట్‌ కాలేజీలు , 105 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి . ఇంటర్మీడియట్‌ విద్యను కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్‌ కాలేజీల్లో  అందించాలి. ప్రభుత్వం పోటీ పరీక్షల తరగతులు నిర్వహించకూడదని, ప్రతి కాలేజీని తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని  ఆదేశించింది. అయితే  పూర్తిస్థాయిలో అధికారులు తనిఖీలు చేయడంలేదు. ఇటీవల నారాయణ కాలేజీ స్థానిక గాయత్రి ఎస్టేట్‌లోని  వుంది అక్కడ  లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నా యాజమాన్యానికి నోటీస్‌లు ఇవ్వలేదు. సుమారు రూ.70 వేల నుంచి లక్ష వరకు నీట్, జేఈఈ లాంగ్‌టర్మ్‌ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి  ఫీజులు వస్తున్నా ఆ విషయం తమ దృష్టికి  రాలేందంటున్నారు.

 

తరగతులతో పాటే శ్రీచైతన్యలో కూడా  కోచింగ్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు.  మరికొన్ని ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇదే తంతు జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు.ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్‌ కాలేజీలను తనిఖీ చేస్తున్నాం.విద్యార్థులను కాలేజీల్లో పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇస్తున్నట్లు తెలిసి తనిఖీ చేసి  అడిగితే లేదని చెబుతున్నారు.

 

గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ కాలేజీలో కోచింగ్‌ ఇస్తున్నట్లు తెలియడంతో తనిఖీలు చేసి తరగతులు నిర్వహించకూడదని ఆదేశించాం. అయితే వారు మరో భవనంలోకి మార్చినట్లు తెలిసింది. కొన్ని కాలేజీల్లో తరగుతులతో పాటు కోచింగ్‌ క్లాస్‌లు ఇస్తున్న మాట వాస్తవమే. ఈ విషయం బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.                

మరింత సమాచారం తెలుసుకోండి: