తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇది గుండెలు గుబగుబలాడించే వార్త. మీకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్సెస్సి పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. వారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, టెన్త్ పరీక్షలు 2020 మార్చి 19 నుండి 2020 ఏప్రిల్ 6 వరకు జరుగుతాయి.

 

పరీక్షా సమయాలు అంతకుముందు సంవత్సరం లాగే ఉదయం 9:30 గంటల నుండి 1 గంట వరకు కొనసాగుతాయి. మార్చి 19వ తేదీ 2020 నుంచి 06వ తేదీ ఏప్రిల్ 2020 వరకు పరీక్షలు జరగుతాయి. పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు మాత్రం ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.

 

పదో తరగతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైంది. విద్యార్థులు ఈ మూడు నెలలు కష్టపడి చదివితే మీ భవిష్యత్ జీవితం బంగారుమయం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: