ప్రతిష్టాత్మకమైన ఈసీఐఎల్ కంపెనీలో కొత్త ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఈ సంస్థ చాలా ప్రతిష్టాత్మక సంస్థ. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఈ సంస్థలో ఉద్యోగం వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయినట్టే.. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్... ఈసీఐఎల్ వివిధ పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

ఏమేం ఉద్యోగాలు ఉన్నాయంటే.. మొత్తం 64 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత అయి ఉండాలి. గేట్ స్కోర్ కూడా ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

 

ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆన్ లైన్ లో సమర్పించుకోవాలి. డిసెంబరు 06 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరితేదీ జనవరి 04, 2020. మరిన్ని వివరాలు కావాలంటే.. వెబ్ సైట్: http://careers.ecil.co.in/ పరిశీలించవచ్చు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: