కేవలం ఇంటర్ అర్హతతో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఢిల్లీ పోలీసు విభాగం కల్పిస్తోంది. ఢిల్లీ పోలీస్‌ విభాగం దేశవ్యాప్తంగా అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తోంది.

 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 649 హెడ్‌ కానిస్టేబుల్‌ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ అర్హత అయినా కేవలం  సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత అయిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తోంది. సంబంధిత సబ్జెక్టులో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌(ఎన్‌టీసీ) ఉండాలి.

 

 

దీంతో పాటు టైపింగ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా అవసరం. ఇక ఈ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు వయసు విషయానికి వస్తే..  01.07.2019 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

 

 

రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 28 ప్రారంభమవుతుంది. జనవరి 27, 2020 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం  http://www.delhipolice.nic.in/ చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: