అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ హాల్ టికెట్లు వచ్చాయో లేదో చెక్ చేసుకుంటే మంచిది. రాకుంటే సంబంధింత అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.

 

ఈనెల 5 న ప్రవేశ పరీక్ష ఉంటుందని.. హైదరాబాద్ జిల్లా డీఈవో బి.వెంకటనర్సమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 విద్యాసంవత్సరంలో ఆరు, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు పరీక్ష ఉంటుందన్నారు. హైదరాబాద్ లోని సైఫా బాద్ హోలీ మేరీ బాలికల ఉన్నత పాఠశాల, సికింద్రాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో పరీక్ష నిర్వహించనున్నారు.

 

పరీక్షలకు హాజరయ్యే వారికి అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఉదయం 9 గంటలలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేయాలని తెలిపారు. ఆలస్యం అయితే లోపలికి రానివ్వబోమని తెలిపారు. ముందు రోజే పరీక్ష కేంద్రం ఎక్కడుందో.. అన్నీ తెలుసుకుంటే చివరి నిమిషయంలో హడావిడి ఉండదు. అందుకే మరోసారి అన్నీ చెక్ చేసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: