2020-21 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఎస్‌డబ్ల్యూఆర్‌ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం జనరల్‌, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీన్ని టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్‌-2020 అంటారు.

 

ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ నేటి నుంచి అంటే జనవరి 8, 2020 న ప్రారంభమవుతుంది. జనవరి 28, 2020 న ముగుస్తుంది.

 

ఈ పరీక్ష రాసేందుకు అర్హత 2019-20 విద్యాసంవత్సరంలో పదోతరగతి, 2020 మార్చిలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్షతేది: మార్చి 01, 2020.

 

పూర్తి వివరాల కోసం https://www.tswreis.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు. ఈ ప్రకటన పదో తరగతి విద్యార్థులకు చాలా కీలకం. ప్రైవేటు పిల్లల భవిష్యత్ బావుండాలంటే.. ప్రైవేటు కాలేజీలే గతి అనే ధోరణి ఉంది. గురుకులాలతో అంత ఖర్చులేకుండా నాణ్యమైన విద్య లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: