మీరు బీసీలా.. చదువుకుంటున్నారా.. అయితే ఈ న్యూస్ మీ కోసమే. నిరు పేద బీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం మహాత్మా జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యా నిధి పథకం కింద బీసీ సంక్షేమశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 

ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈపాస్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే.. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించకూడదు. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు రావాలి. దీంతో పాటు ఆంగ్ల భాష ప్రావీణ్యత ధ్రువీకరణ ఉండాలి.

 

అంతే కాదు.. ఈ సౌకర్యం మీరు పొదాలంటే.. సంబంధిత అభ్యర్థుల గరిష్ఠ వయసు జులై 1వ తేదీ నాటికి 35 ఏళ్లు దాటకూడదు. ఇంకేం ఒక్కసారి అర్హతలు పరిశీలించుకోండి. మీకు ఓకే అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి. మీకు ఓకే కాకపోయినా.. ఇతరులకు ఈ సమాచారం ఉపయోగపడొచ్చు. అందుకే వెంటనే షేర్ చేయండి.. మీ మీ వాట్సప్ గ్రూపుల్లో పంచుకోండి. మరొకరికి సాయం చేసిన వారు అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: