కేవలం పదో తరగతితో కేంద్రప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకునే అవకాశం వచ్చింది. దీనికి అప్లయ్ చేసుకునేందుకు ఈరోజు, రేపు మాత్రమే అవకాశం ఉంది. అందుకే త్వరపడండి.. వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెయిల్ లో పలు విభాగాల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది.

 

న్యూఢిల్లీలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. సెయిల్‌కు చెందిన దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌ లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. వీటి ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం ఖాళీలు 105 పోస్టులు ఉన్నాయి. ఏమేం ఉద్యోగాలు ఉన్నాయంటే.. అసిస్టెంట్‌ మేనేజర్‌, మెడికల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌, ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ తదితర జాబ్ లు ఉన్నాయి.

 

ఈ ఉద్యోగాలకు .. ఆయా ఉద్యోగాన్ని బట్టి పదోతరగతితో పాటు, సంబంధిత ట్రేడుల్లో/సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత అవసరం.. కొన్ని ఉద్యోగాలకు అనుభవం కూడా ఉండాలి.

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ జనవరి 5 న ప్రారంభమైంది. 27 జనవరి న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం అనే వెబ్ సైట్ https:///sail.co.in/ ను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: