నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. గ్రామ / వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న  2,146  పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ జారి చేసింది.  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 31వ తేది వరకు గడువు ఇచ్చారు. wardsachivalayam.ap.gov.in, gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్లలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. పోస్టుల వారీగా విద్యార్హ‌త‌లు నిర్ణ‌యించారు. స‌రైన అర్హ‌త‌లు ఉన్న అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 30లోగా ఫీజు చెల్లించి.. 31లోగా ఆన్‌లైన్ ధ‌ర‌కాస్తు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. 

 

పోస్టుల వివ‌రాలు చూస్తే.. వార్డు పరిపాలనా కార్యదర్శి - 105, వార్డు వసతుల కార్యదర్శి - 371, వార్డు పారిశుధ్య , పర్యావరణ కార్యదర్శి - 513, వార్డు విద్య , డేటా ప్రోసెసింగ్ కార్యదర్శి - 100, వార్డు ప్రణాళికా, రేగులాటిన్ కార్యదర్శి - 844, వార్డు సంక్షేమ , అభివృద్ధి కార్యదర్శి - 213 ఫోస్టులు ఉన్నాయి. అయితే వీటిలో వార్డు పరిపాలనా కార్యదర్శి పోస్టులు చూస్తే.. ఖాళీల సంఖ్య: 105. జిల్లాల వారీగా ఖాళీలు.. శ్రీకాకుళం: 02, విజయనగరం: 02, విశాఖపట్నం: 42,  తూర్పు గోదావరి : 16, పశ్చిమ గోదావరి: 12, కృష్ణా: 17, గుంటూరు: 01, నెల్లూరు: 02, ప్రకాశం: 01, క‌ర్నూలు: 03, వైఎస్సార్ కడప: 01, చిత్తూరు: 06 ఖ‌ళీలు ఉన్నాయి. అర్హత.. ఏదైనా డిగ్రీ.

 

వార్డు వసతుల కార్యదర్శి - 371. ఇందులో జిల్లాల వారీగా ఖాళీలు.. శ్రీకాకుళం: 09, విజయనగరం: 10, విశాఖపట్నం: 11, తూర్పు గోదావరి : 30, పశ్చిమ గోదావరి: 45, కృష్ణా: 13, గుంటూరు: 16, నెల్లూరు: 50, ప్రకాశం: 21, అనంతపురం: 72, కర్నూలు: 53, వైఎస్సార్ కడప: 11, చిత్తూరు: 30 ఖాళీలు ఉన్నాయి. అర్హత.. పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్/ మెకానికల్ ఇంజినీరింగ్)తోపాటు ఆపై విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్డు పారిశుధ్య , పర్యావరణ కార్యదర్శి - 513. ఇందులో.. శ్రీకాకుళం: 06, విజయనగరం: 05, విశాఖపట్నం: 129, తూర్పు గోదావరి : 24, పశ్చిమ గోదావరి: 18, కృష్ణా: 111, గుంటూరు: 44,  నెల్లూరు: 25, ప్రకాశం: 10, అనంతపురం: 31, కర్నూలు: 09, వైఎస్సార్ కడప: 26, చిత్తూరు: 75 ఖాళీలు ఉన్నాయి.

 

వార్డు విద్య , డేటా ప్రోసెసింగ్ కార్యదర్శి - 100. ఇందులో శ్రీకాకుళం: 02, విజయనగరం: 02, విశాఖపట్నం: 07, తూర్పు గోదావరి: 10 , పశ్చిమ గోదావరి: 24,  కృష్ణా: 08, గుంటూరు: 09, నెల్లూరు: 07, ప్రకాశం: 06, అనంతపురం: 05,  కర్నూలు: 06, వైఎస్సార్ కడప: 04, చిత్తూరు: 10 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ లేదా తత్సమాన విభాగాల్లో బీటెక్/ బీఎస్సీ/ బీసీఏ/ ఎంసీఏ అర్హత ఉండాలి.  వార్డు ప్రణాళికా, రేగులాటిన్ కార్యదర్శి - 844. ఇందులో శ్రీకాకుళం: 15,  విజయనగరం: 14, విశాఖపట్నం: 115, తూర్పు గోదావరి: 82, పశ్చిమ గోదావరి: 48, కృష్ణా: 102, గుంటూరు: 105, నెల్లూరు: 74, ప్రకాశం: 38, అనంతపురం: 57,  కర్నూలు: 62, వైఎస్సార్ కడప: 46, చిత్తూరు: 86 ఖాళీగా ఉన్నాయి.

 

పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్)/ఎల్‌ఏఏ లేదా బీఆర్క్/ బీప్లానింగ్, ఆపై విద్యార్హత ఉండాలి. ఇక చివ‌రిగా వార్డు సంక్షేమ , అభివృద్ధి కార్యదర్శి - 213. ఇందులో.. శ్రీకాకుళం: 06, విజయనగరం: 05, విశాఖపట్నం: 44, తూర్పు గోదావరి: 20, పశ్చిమ గోదావరి: 08, కృష్ణా: 30, గుంటూరు: 15, నెల్లూరు: 18,  ప్రకాశం: 05, అనంతపురం: 03, కర్నూలు: 09, వైఎస్సార్ కడప: 13, చిత్తూరు: 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ ఉండాలి.  01.07.2020 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978- 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: