అర్హత కేవలం డిప్లోమా మాత్రమే అయినా ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్న ఉద్యోగాలు ఇవి. రక్షణ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ కావడం వల్ల ఇందులో ఉద్యోగం సంపాదించుకుంటే లైఫ్ సెటిల్ అయినట్టే భావించవచ్చు. ఇంతకీ ఏ కంపెనీ యో చెప్పలేదు కదా.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. బెల్.. ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖతన ఘజియాబాద్ యూనిట్ కోసం ఈ పోస్టులు భర్తీ చేయాలనుకుంటోంది.
ఇంతకీ ఏమేం ఉద్యోగాలు ఉన్నాయంటే.. సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. తగినంత అనుభవం కూడా ఉండాలి.
ఆన్లైన్ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ రేపటితో అంటే ఫిబ్రవరి 01 2020న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం http :// www. belnindia. In / అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.