డిప్లొమా, డిగ్రీతో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం లభించింది. ఈరోజే అంటే 17 ఫిబ్రవరి లాస్ట్ డేట్. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ బీఈసీఐఎల్ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది న్యూఢిల్లీలోని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీలో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తారు.
వివరాలు చూద్దాం..
మొత్తం ఖాళీలు: 77
పోస్టులు-ఖాళీలు: సర్వేయర్లు-75
ప్రోగ్రామర్లు-02.
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా
ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత
అనుభవం కూడా అవసరం.
వయసు:
30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్. చివరితేది: ఫిబ్రవరి 17, 2020.
ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చి ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.
మరిన్ని వివరాల కోసం వెబ్సైట్: https://www.becil.com/ పరిశీలించవచ్చు.