ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఎగ్జిమ్‌ బ్యాంక్‌ లో పలు రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 7 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇక రేపే అంటే ఫిబ్రవరి 22, 2020 లాస్ట్ డేట్. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షతేది: మార్చి 15, 2020.

 

మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగాల రకాలు ఏంటంటే.. చీఫ్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, తదితర ఉద్యోగా ఉన్నాయి. ఇక వీటికి అర్హతలు ఏంటంటే.. పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

 

రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌: https://www.eximbankindia.in/ చూడొచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: