ఈనాడు.. తెలుగులో ప్రతిష్టాత్మకమైన దినపత్రిక. తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక కూడా. ఇప్పుడు ఈ గ్రూపు సంస్థల్లో ఉద్యోగ అవకాశం వచ్చింది. రామోజీ గ్రూపు సంస్థ అయిన ఉషోదయా పబ్లికేషన్స్ సంస్థ మేనేజ్‌ మెంట్ ట్రయినీల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాల కోసం ఎవరైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనాడు గ్రూపు సంస్థల్లో ఉద్యోగం అంటే దాదాపు ప్రభుత్వ ఉద్యోగంగా భావిస్తుంటారు.

 

 

కాకపోతే వయస్సు 24 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ప్రయారిటీ ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తర్వాత రాత పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్ష ఏపీ, తెలంగాణల్లో అనేక కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది.

 

 

శిక్షణ సమయంలో రూ. 20,000 స్టయిఫండ్ గా ఇస్తారు. ఎంపికైన వారు ఏపీ, తెలంగాణల్లో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను రూ. 25, 000 ప్రారంభవేతనంతో ఉద్యోగంలోకి తీసుకుంటారు.

 

 

ఆసక్తి ఉన్నవారు.. recruitment@eenadu.net కు మెయిల్ ద్వారా కానీ.. లేదా రెజ్యూమ్‌లు పది రోజుల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్- హెచ్‌ఆర్‌, ఉషోదయా పబ్లికేషన్స్ , ఈనాడు కార్పొరేట్ ఆఫీస్, రామోజీ ఫిలింసిటీ - 501512 చిరునామాకు పంపొచ్చు. మరిన్ని వివరాల కోసం ఫిబ్రవరి 28 నాటి ఈనాడు దినపత్రికను పరిశీలించవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: