ఈరోజుల్లో చాలా మంది ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం చేయలేక రైతులు, ఉద్యోగాలు భర్తీ లేక నిరుద్యోగ యువత దిక్కుతోచని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అయితే ఉద్యోగాలు లేక కష్టాలు ఎదుర్కొంటున్నవారికి శుభవార్త. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 307 ఖాళీలను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ, ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాల్లో గల ఓపెన్ క్యాస్ట్ మైన్స్‌లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 

 

డ్రాగ్‌లైన్ ఆపరేటర్, డోజర్ ఆపరేటర్, డంపర్ ఆపరేటర్, క్రేన్ ఆపరేటర్ లాంటి పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://nclcil.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. మ‌రో విష‌యం ఏంటంటే.. ఇవన్నీ ట్రైనీ పోస్టులే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 30 చివరి తేదీ. 

 

పోస్టుల వివ‌రాలు చూస్తే.. 
మొత్తం ఖాళీలు- 307
డంపర్ ఆపరేటర్- 167షోవెల్ ఆపరేటర్ (ట్రైనీ)- 28
డ్రాగ్‌లైన్ ఆపరేటర్- 9
పే లోడర్ ఆపరేటర్- 6

 

క్రేన్ ఆపరేటర్- 21
డ్రిల్ ఆపరేటర్- 17
డోజర్ ఆపరేటర్- 48
గ్రేడర్ ఆపరేటర్ - 11

 

అర్హతలు- ఎస్ఎస్‌సీ పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఈ, హెచ్ఎంవీ లైసెన్స్ కూడా త‌ప్ప‌కుండా ఉండాలి.
వయస్సు- 2020 మార్చి 16 నుంచి మార్చి 30
దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 30

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: