రైల్వేలో ఉద్యోగం చేయడం మీ కల..? అయితే మీకో గుడ్ న్యూస్. కోల్ కత్తా ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు రైల్వే లో 2792 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 2792 పోస్టులు. ఈ నోటిఫికేషన్లో భాగంగా యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు వాస్తవానికి 2020 ఫిబ్రవరి 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.
మార్చి 13 చివరి తేదీగా ప్రకటించింది ఈస్టర్న్ రైల్వే. కాని, ఈ నోటిఫికేషన్కు సంబంధించి తేదీలను సవరిస్తూ నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్ ప్రకారం 2020 మార్చి 5న నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 4 చివరి తేదీ. అంతే మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. పూర్తి వివరాలను http://www.rrcer.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మొత్తం 2792 ఖాళీలు ఉండగా అందులో ఫిట్టర్- 1070, వెల్డర్-547, మెకానిక్ (ఎంవీ)- 9, మెకానిక్ (డీజిల్)- 123, బ్లాక్స్మిత్- 9, మెషినిస్ట్- 74, కార్పెంటర్ -20, పెయింటర్- 26, లైన్మ్యాన్- 49, వైర్మ్యాన్- 67, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్- 54, ఎలక్ట్రీషియన్- 593, మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 9, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 75, టర్నర్- 67 పోస్టులున్నాయి. ఇక గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి 50శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. మరియు మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.