ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనికి క‌ట్ట‌డి చేయ‌డం క‌త్తి మీద సాములా మారింది. ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో.. చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొద‌ట‌ 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ కోసం 18 పోస్టుల్ని కలుపుతున్నట్టు ప్రకటించింది. దీంతో పోస్టుల సంఖ్య 185 కి పెరిగింది. అయితే ఇప్పుడు మరిన్ని పోస్టుల్ని ఇదే నోటిఫికేషన్‌లో కలిపింది. 126 కొత్త పోస్టుల్ని ప్రకటించడంతో భర్తీ చేయనున్న ఖాళీల సంఖ్య 311 కు పెరిగింది. దీంతో ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 311 పోస్టులు ఉండ‌గా.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 81, మెకానికల్ ఇంజనీరింగ్- 82, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 60, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 12మెటల్లార్జీ- 10, ఫిజిక్స్- 14, కెమిస్ట్రీ- 7 పోస్టులు ఉన్నాయి.

 

వీటితో పాటు కెమికల్ ఇంజనీరింగ్- 11, ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 17, సివిల్ ఇంజనీరింగ్- 3, మ్యాథమెటిక్స్- 4, సైకాలజీ- 10 పోస్టులు ఉన్నాయి. విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్, నెట్ స్కోర్ ఉండాలి. అలాగే దరఖాస్తు ఫీజు రూ.100 చ‌ల్లించాలి. ఇక‌ ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: