ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ అనతి కాలంలోనే దేశదేశాలు విస్తరించి.. లక్షల ప్రాణాలను బలితీసుకుంటోంది. వ్యాక్సిన్ లేని కరోనాను కట్టడి చేసేందుకు నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. ఈ క్రమంలోనే వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు, సూచనలు చేస్తున్నాయి. అయితే మరోవైపు ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
కరోనా దెబ్బకు అప్పుల భారం తట్టుకోలేని పలు కంపెనీలు ఉద్యోగులను పీకేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 12 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ మొత్తం టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 22 చివరి తేదీ. అంటే మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఆ రోజు సాయంత్రం 4 గంటల్లోగా ఈ పోస్టులకు అప్లై చేయాల్సి ఉంటుంది.
అయితే ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. విద్యార్హత విషయానికి వస్తే.. కంప్యూటర్ సైన్స్లో 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. మరియు ఏడాది అనుభవం తప్పనిసరి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది ఈసీఐఎల్. ఎంపికైనవారికి వేతనం రూ.23,000 ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం http://careers.ecil.co.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. మరియు ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.