గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 3వ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1608: క్విబెక్ నగరాన్ని (కెనడా) సామ్యూల్ డి ఛాంప్లేన్ స్థాపిఛాడు.
1767 : ఫిలిప్ కార్టెరెట్ నాయకత్వంలో జరిగిన ఒక సాహస యాత్ర లో, రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు (మిడ్ షిప్ మాన్), ఒక దీవిని కనిపెట్టాడు. ఆ దీవికి అతని పేరుతోనే పిట్కేర్న్ దీవి అని పేరు పెట్టారు.
1767: అడ్రెస్సీవిసెన్ అనే పేరుగల నార్వే దేశపు వార్తా పత్రిక మొదటి సారిగా ముద్రించారు. ఆ పత్రికను నేటికీ ముద్రిస్తున్నారు.
1819: అమెరికా లోని, న్యూయార్క్ నగరంలో, ది బ్యాంక్ ఆఫ్ సేవింగ్స్ అనే సేవింగ్స్ బ్యాంక్ మొట్టమొదటగా మొదలు పెట్టారు.
1863: అమెరికన్ సివిల్ వార్లో భాగంగా జరిగిన గెట్టిస్ బర్గ్ యుద్ధం అంతమయ్యింది.
1884: డౌ జోన్స్ అండ్ కంపెనీ ముద్రణా సంస్థ మొట్ట మొదటి సారి స్టాక్ ఏవరేజ్ని ముద్రించింది. ఈ సంస్థని ముగ్గురు విలేకరులు ' ఛార్లే స్ డౌ ', 'ఎడ్వర్ద్ జోన్స్ ', 'ఛార్లెస్ బెర్గ్ స్ట్రెస్సెర్ ' మొదలు పెట్టారు.
1886: ' కార్ల్ బెంజ్ ' పేటెంట్ పొందిన 'మోటారు వేగన్ ' ని మొట్ట మొదటి సారిగా అధికారికంగా విడుదల చేసాడు.
1886: మొట్ట మొదటి లినో టైపు యంత్రాన్ని (పుస్తక ముద్రణలో వాడే యంత్రం) 'ది న్యూ యార్క్ ట్రిబ్యున్ ' అనే వార్తా పత్రిక వాడింది. అంతకు ముందు, పత్రికా ముద్రణలో, అత్యంత శ్రమతో కూడి, చేతితో కూర్చే ' టైప్ సెట్టింగ్ విధానం ' వాడేవారు.
1890 : అమెరికాలో 43వ రాష్ట్రంగా ఇదాహొ చేరింది.
1928: జాన్ లాగీ బేర్డ్ మొదటి రంగుల టెలివిజన్ని ప్రసారం చేసాడు.
1981: న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మొట్టమొదటిసారిగా 'కొత్తరకం జబ్బు' గా పేర్కొన్నారు. తరువాత, ఆ జబ్బు కే, ఎయిడ్స్ అని పేరు పెట్టారు.
1988 : గల్ఫ్ తీరంలో వున్న అమెరికా యుద్ధ నౌక పొరపాటున ఒక ఇరానియన్ విమానాన్ని కూల్చి వేసింది.
1994: టెక్సాస్ ట్రాఫిక్ చరిత్రలో (రోడ్డు ప్రమాదాలలో ) ఈ రోజున 46 మంది మరణించటం అత్యంత విషాదకరమైన విషయమని టెక్సాస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ చెప్పింది.
1996: స్టోన్ ఆఫ్ స్కోన్ స్కాట్లాండ్ తిరిగి చేరుకుంది.
2001: వ్లాదివోస్తోక్ అవియా తుపొలెవ్ సంస్థకు చెందిన విమానం టి.యు-154 జెట్ లైనర్ రష్యా లోని ఇర్కుత్ స్క్ విమానాశ్రయం సమీపంలో నేలకు దిగుతున్నప్పుడు కూలి పోయి 145 మంది ప్రయాణీకులు మరణించారు.
2006: స్పెయిన్ లోని వేలెన్ సియాలో జరిగిన వేలెన్ సియా మెట్రో ప్రమాదంలో 43మంది మరణించారు.
2006: భూమికి 4,32,308 కిలోమీటర్ల ( 2,68,624 మైళ్ళు) దూరంలో ఆస్టరాయిడ్ 2004 ఎక్స్.పి.14 అనే గ్రహ శకలం ప్రయాణించింది.
2009: మార్క్ II.5 స్కై ట్రెయిన్ పేరు గల కార్లు కెనడా లోని వాన్ కూవర్ మెట్రో నగరంలో ప్రవేశ పెట్టారు .


జననాలు


1851: చార్లెస్ బాన్నర్‌మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్‌మెన్. (మ.1930)
1898: దీవి రంగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు.ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (మ.1976)
1903: నారు నాగ నార్య, సాహితీవేత్త. (మ.1973)
1914: విశ్వనాథశర్మ, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
1918: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (మ.1974)
1924: సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (మ.1999)
1924: మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు. (మ.1993)
1927: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత. (మ.2000)
1928: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని. (మ.1990)
1939: లకంసాని చక్రధరరావు, "తెలుగు వ్యుత్పత్తి కోశం" సంపాదకుడు
1951: రిచర్డ్ హాడ్లీ, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు.
1962: టామ్ క్రూజ్, అమెరికా దేశ నటుడు, చలన చిత్ర నిర్మాత.
1971: జూలియన్ అసాంజే, ఆస్ట్రేలియన్ ప్రచురణకర్త, పాత్రికేయుడు, మాద్యమ, అంతర్జాల వ్యవస్థాపకుడు, మాద్యమ విమర్శకుడు, రచయిత, కంప్యూటర్ ప్రోగ్రామర్, రాజకీయ, అంతర్జాల కార్యకర్త.
1980: హర్భజన్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.


మరణాలు


1910: రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషిచేసిన వాడు. (జ.1877)
1996: చకిలం శ్రీనివాసరావు, నల్గొండ లోకసభ సభ్యులు. (జ.1922)
2015: తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1924)
2016: స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి. (జ.1975)

మరింత సమాచారం తెలుసుకోండి: