గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 10 వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం

 

ముఖ్య సంఘటనలు

 

1794: పద్మనాభ యుద్ధం జరిగింది.
1846: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.
1991: భారత లోక్‌సభ సభాపతిగా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు.
2008: సల్మాన్ రష్డీ రచించిన నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
2010: అమరనాథ్ మంచులింగ దర్శనం కోసం బస్సులో వెళుతున్న ప్రయాణీకులను డ్రైవరు సలీం గఫూర్ రక్షించాడు.

ప్ర‌ముఖుల జననం


1856: నికొలా టెస్లా ఆస్ట్రియా (ఇప్పటి క్రొయాటియా) లో స్మిల్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు. (మ 1943). మేగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి కొలమానంగా కొలిచే ప్రమాణాన్ని, ఇతని గౌరవార్ధం టెస్లాగా పిలుస్తున్నారు. ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సమయంలో ఈ టెస్లా పేరు వినపడుతుంది.
1916: కోన ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి. (మ.1990)
1920: పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (మ.2007)
1926: అక్కిరాజు వాసుదేవరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
1928: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009)
1928: గూటాల కృష్ణమూర్తి, 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ
1939: కేతు విశ్వనాథ రెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయిత.
1945: కోట శ్రీనివాసరావు, తెలుగు సినిమా నటుడు
1949: సునీల్ గవాస్కర్, "లిటిల్ మాస్టర్"గా పేరొందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
1951: మెడియం బాబూరావ్, భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి 14 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు, party OF INDIA' target='_blank' title='కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) లో క్రియాశీల సభ్యులు.
1980: జెస్సికా సింప్సన్, ఒక అమెరికా గాయని, నటి, బుల్లితెర వ్యాఖ్యాత.


ప్ర‌ముఖుల మరణం


1794: పద్మనాభ యుద్ధంలో ఆ యుద్ధ కథా నాయకుడు రెండవ విజయ రామరాజు గజపతి రాజు మరణం. పద్మనాభంలో ఇతని సమాధి ఉంది.
1806: జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. గుర్రాల చిత్రాల ద్వారా పేరొందాడు. (జ.1724)
1966: వి.డి.సావర్కర్, భారతీయ అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: