నిజానికి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడో ముగిసిపోయింది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దరఖాస్తు గడువును పెంచేసింది. అభ్యర్థులు తమకిష్టమైన 3 ఎగ్జామినేషన్ సెంటర్లను ఫేజ్(Phase) వన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫేజ్ 2 లో ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫేజ్ 1, ఫేజ్ 2 లలో వేర్వేరు ఎగ్జామినేషన్ సెంటర్ ల పేర్లు రాయాల్సి ఉంటుంది. ఏం పరీక్ష కేంద్రాలు ఒకసారి తెలుసుకుంటే... ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్, రాజమండ్రి, గుంటూరు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ ఉన్నాయి.
ఈ విపత్కర సమయాల్లో అభ్యర్థులు రిస్కు చేసి తమ డబ్బులు పెట్టుకొని రావాల్సి ఉంటుంది. పరీక్షకి హాజరైనప్పుడు కరోనా వైరస్ సోకితే తమ బాధ్యత కాదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. విద్య అర్హత వివిధ పోస్టులకు వివిధ రకాల అర్హత ఉండాల్సి ఉంటుంది. వయోపరిమితి ఫిబ్రవరి 29, 2020 నాటికి 30 సంవత్సరాలు ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం https://www.sebi.gov.in/ ని విజిట్ చేయండి.
Powered by Froala Editor