గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 12వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం

 

ముఖ్య సంఘటనలు


1961: పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.
1979: కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.

జననాలు


1904: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973)
1906: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981)
1930: ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991)
1933: గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (మ.2017)
1955: నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
1957: శ్రీలక్ష్మి రేబాల, నటి, భరతనాట్య కళాకారిణి.
1958: శిలాలోలిత, కవయిత్రి, విమర్శకురాలు.
1977: బ్రాక్ లెస్నర్, అమెరికన్ మిశ్రమ రణతంత్ర యోధుడు, మాజీ వృత్తిగత, ఔత్సాహిక మల్లయోధుడు.
1982: ఆచంట శరత్ కమల్, టేబుల్ టెన్నిస్ ఆటగాడు.1997 nagu babu


మరణాలు


1803: కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703)
1923: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877)
1985: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (జ.1923)
1994: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924)
1999: రాజేంద్ర కుమార్, హిందీ నటుడు. (జ.1929)
2012: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928)


ముఖ్యమైన దినోత్స‌వాలు..


కిరిబతి స్వాతంత్ర్యదినం. యునైటెడ్ కింగ్ డం నుంచి 1979 లో స్వాతంత్ర్యం పొందింది.
సావొ టోమే, ప్రిన్చిపె దీవుల స్వాతంత్ర్య దినం. పోర్చుగల్ నుంచి 1975 లో స్వాతంత్ర్యం పొందింది.
నాదం - మంగోలియా దేశంలో జూలై 11 నుంచి జూలై13 వరకు జాతీయ సెలవు దినాలు (మంగోలియాలో పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది). నాదం పండుగ 3 రోజులు జరుగుతుంది. ఇది రెండవ రోజు. ఈ మూడు రోజులు మంగోలియాలో 3 ఆటలు ఆడతారు. కుస్తీలు, గుర్రపు స్వారి, విలువిద్య. ఇటీవల మంగోలియన్ స్త్రీలు కూడా గుర్రపు స్వారి, విలువిద్య లలో పాల్గొంటున్నారు. ముఖ్యమైన పండుగ మంగోలియా రాజధాని ఉలాన్బాతార్ నగరంలోని జాతీయ కీడా మైదానం (నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం) లో జరుగుతుంది.
నాబార్డ్ స్థాపక దినోత్సవం.
తెలంగాణలో మూడవ విడత హరితహారం ప్రారంభం

మరింత సమాచారం తెలుసుకోండి: