దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల దరఖాస్తుకు సమయం దగ్గరపడింది. కరోనా ప్రభావం, లాక్ డౌన్ వంటి సమస్యలు ఉన్నా.. దీనికి దరఖాస్తు చేయడం మాత్రం మరచిపోవద్దు. దీనికి చివరి తేదీ మార్చి 30 తేదీ. చివరి తేదీ వచ్చే వరకూ వెయిట్ చేయడం, అప్పుడు కంగారు పడటం చేయొద్దు.

 

 

ఎఫ్‌సీఐ రిక్రూట్‌మెంట్‌-2020కు ప్రకటన ఇప్పటికే వెలువడింది. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగ ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చినా దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 28 న ప్రారంభమమైంది. ఇది మార్చి 30 న ముగుస్తుంది.

 

 

ఇది చాలా పెద్ద నోటిఫికేషన్.. ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌), స్టెనో (హిందీ), టైపిస్ట్‌ (హిందీ), అసిస్టెంట్‌ గ్రేడ్‌ (జనరల్‌/ అకౌంట్స్‌/ టెక్నికల్‌)లత పాటు ఇంకా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి.

 

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://fci.gov.in/ ను చూడవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: