ఈ నెల 20వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్ప నాధికారి ఏ కళ్యాణి తెలిపారు. సత్యటౌన్‌షిప్‌ సంస్థలో మార్కె టింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, మార్కెటింగ్‌ మేనేజర్స్‌, టెలీకాలర్స్‌, ఆఫీస్‌ స్టాఫ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలకు ఎంపిక చేస్తామన్నారు. పదవ తరగతి, ఇంటర్‌, డిగ్రీ చదివి, 19 నుంచి 40 సంవత్సరాలలోపు వయసున్న అభ్యర్థులు అర్హుల న్నారు. మొత్తం ఖాళీలు 100 ఉన్నాయని, నెలసరి జీతం రూ. 6500, టీఏ, డీఏ ఉంటుందని, జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువకులు విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: