దూరవిద్య ద్వారా విద్యని అభ్యసించాలని అనుకునే వారు ఎవరైనా సరే “హెచ్ సీయూ” నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు..అయితే “హెచ్ సీయూ” తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది..హైద‌రాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 'దూరవిద్య' ద్వారా పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

 Related image

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ ఆధ్వర్యంలోని 'సెంట‌ర్ ఫ‌ర్ డిస్టెన్స్ & విజువ‌ల్ లెర్నింగ్' 2018 సంవ‌త్సరానికిగాను ఈ ప్రవేశాలను చేపట్టనుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.300. ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

కోర్సుల వారిగా వివరాలు

పీజీ డిప్లమో కోర్సులు


విభాగాలు:   ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్,  బిజినెస్ మేనేజ్‌మెంట్,  ఎనర్జీ మేనేజ్‌మెంట్,  లైబ్రరీ ఆటోమేషన్ & నెట్‌వర్కింగ్,  సైబర్ లా & ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్,  కమ్యూనికేటివ్ ఇంగ్లిష్,  క్రిమినల్ జస్టిస్ & ఫోరెన్సిక్ సైన్స్,  గవర్నెన్స్,  హ్యూమన్ రైట్స్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్ ఇన్ హిందీ,  టెలికమ్యూనికేషన్స్,  కెమికల్ అనాలిసిస్ & క్వాలిటీ మేనేజ్‌మెంట్,  మెడిసినల్ బోటనీ,  టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్,  టెలికాం టెక్నాలజీ & మేనేజ్‌మెంట్.

అర్హత:   సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉండాలి.

చివరితేది:     ఫిబ్రవరి 28.


మరింత సమాచారం తెలుసుకోండి: