రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది..కొన్ని రోజుల క్రితం విడుదలయిన నోటిఫికేషన్ కంటే కూడా ఈసారి భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చింది ఆర్ఆర్బీ..దేశంలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (ఆర్ఆర్బీలు) మొత్తం కలిపి సుమారు 62,907 భారీ గ్రేడ్ -4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి.అయితే ఈ ఉద్యోగాలు అన్నీ కూడా 10 తరగతి మరియు ఐటిఐ ఉత్తీర్ణతతో ఉన్నాయి..వివరాలలోకి వెళ్తే..
అర్హత: కొన్నింటికి పదోతరగతి, మిగతా వాటికి పదో
తరగతితోపాటు ఐటిఐ ఉత్తీర్ణత.
పోస్టులు: ట్రాక్మెన్, గేట్మెన్, స్విచ్మెన్, ఎలక్ట్రికల్/
ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ సిగ్నల్/ టెలి కమ్యూనికేషన్ విభాగాల్లో హెల్పర్స్, పోర్టర్ .
వయసు: 2018 జూలై 1 నాటికి 18 నుంచి 31 ఏళ్లలోపు వారు దరఖాస్తు
చేసుకోవచ్చు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపులు ఉంటాయి.
వేతనం: ఉద్యోగాలకు ఎంపికైన వారు నెలకు రూ. 18 వేల వేతనంతో పాటు
అలవెన్సులు పొందుతారు.
దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 10 నుంచి మార్చి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: http://rrbsecunderabad.nic.in