పదోతరగతి అర్హతతో తెలంగాణ పోస్టల్సర్కిల్లో ఖాళీల భర్తీకి
ప్రకటన వెలువడింది. వీటిల్లో 132 పోస్ట్మెన్, నాలుగు మెయిల్గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి. రాత
పరీక్షలో ప్రతిభ ద్వారా పదో తరగతితోనే ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు : హైదరాబాద్ ప్రధాన కార్యాలయం పరిధిలో 75; హైదరాబాద్ రీజియన్(పలు జిల్లాల్లో)లో 57 పోస్ట్మెన్ ఉద్యోగాలతోపాటు నాలుగు మెయిల్గార్డు
ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత: పదోతరగతి/మెట్రిక్యులేషన్.
వయోపరిమితి: ఏప్రిల్ 21, 2018 నాటికి 18-27 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు 3ఏళ్ల సడలింపు
ఉంటుంది).
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
వేతనాలు: రూ.21,700 స్కేల్ పే.
పరీక్షా విధానం :
పదోతరగతి స్థాయిలో
ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో నాలుగు
విభాగాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రుణాత్మక మార్కులు
ఉండవు. పరీక్ష సమయం రెండు గంటలు.
మొత్తం మార్కులు: 100
పార్ట్ ఏ : 25 మార్కులు-25 ప్రశ్నలు(జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ)
పార్ట్ బీ : 25 మార్కులు-25 ప్రశ్నలు (మ్యాథమెటి క్స్)
పార్ట్ సీ: రెండు విభాగాలు ఉంటాయి.
1) 25 మార్కులు-25 ప్రశ్నలు(ఇంగ్లిష్)
2)25 మార్కులు-25 ప్రశ్నలు(తెలుగు)
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఏప్రిల్ 21.
దరఖాస్తు రుసుం: ఓసీ/ఓబీసీ రూ.400(అదనంగా రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు), ఎస్సీ/ఎస్టీలకు రూ.100, మహిళలకు రూ.100.
ఫీజు చెల్లించడానికి చివరి తేది: ఏప్రిల్ 25, 2018.
ఆన్లైన్ తుది దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 28.
పరీక్ష తేది: త్వరలోనే ప్రకటిస్తారు.
మరిన్ని
వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: http://telanganapostalcircle.in