గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల మైనార్టీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. ఈ కాలేజీల్లో ఏపీఆర్‌జేసీ-సెట్‌తో సంబంధం లేకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.. ముస్లిం మైనార్టీ బాలబాలికలు మాత్రమే అర్హులు.

 Image result for ap govt logo

ఖాళీలు ఉన్న కళాశాలలు:  గుంటూరు (బాలురు), కర్నూలు (బాలురు), వాయిల్పాడు-చిత్తూరు (బాలికలు).
అందుబాటులోఉన్న గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ. ఒక్కో కాలేజీలో వరుసగా 40, 40, 35 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

బోధనా మాధ్యమం:  ఉర్దూ, ఇంగ్లిష్. 

అర్హతలు:  ముస్లిం మైనార్టీ బాలబాలికలు మాత్రమే అర్హులు. 2018 మార్చి/ ఏప్రిల్ పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 10, 2018

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 25, 2018

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.apresidential.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: