తెలంగాణలోని వివిధ గురుకుల
సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో 2932 పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి
గురుకుల విద్యాలయాల నియామక మండలి (టీఆర్ఈఐ-ఆర్బీ) దరఖాస్తులు కోరుతోంది..పోస్టుల
వివరాలు పరిశీలిస్తే..పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్.. ట్రైన్డ్
గ్రాడ్యుయేట్ టీచర్ లకి వేరు వేరుగా ఖాళీలు కేటాయించింది..
పోస్టుల వివరాలు...
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్
(పీజీటీ): 1972
సొసైటీల వారీ ఖాళీలు: బీసీ-472, ఎస్టీ-49, సాధారణ గురుకుల సొసైటీ-16, ఎస్సీ-155, మైనార్టీ-1280.
ఖాళీలున్న సబ్జెక్టులు: తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పీజీతో పాటు
బీఈడీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45% మార్కులు ఉంటే చాలు.
వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600.
ఆన్లైన్ దరఖాస్తు
ప్రారంభం: 2018, జూలై 9.
దరఖాస్తుకు చివరితేదీ: 2018, ఆగస్టు 8.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్
టీచర్ (టీజీటీ) : 960
సొసైటీల వారీ ఖాళీలు: సాధారణ గురుకుల సొసైటీ-27, ఎస్సీ-597, మైనార్టీ-236, ట్రైబల్ వెల్ఫేర్-100.
ఖాళీలున్న సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, సంస్కృతం, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్.
అర్హతలు: సంబంధిత
సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45% మార్కులు ఉంటే చాలు. టీఎస్టెట్/ఏపీటెట్/సీటెట్లో
అర్హత సాధించి ఉండాలి.
వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (80%),
టెట్ స్కోర్ (20%)ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 9, 2018
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 8, 2018
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: https://treirb.telangana.gov.in