న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) దేశంలోని వివిధ ఎయిమ్స్‌లలో రెగ్యులర్ విధానంలో 2000 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్: గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..వివిధ రాష్ట్రాలో ఉన్న ఎయిమ్స్ సంస్థలలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 Jobs

ఎయిమ్స్‌ల వారీ ఖాళీలు:  భోపాల్-600, జోధ్‌పూర్-600, పట్నా-500, రాయ్‌పూర్-300. 

అర్హత : బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్)/పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ లేదా డిప్లొమా, నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్, అనుభవం ఉండాలి.

వయసు :  2018, అక్టోబర్ 29 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక :   కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ద్వారా.

రాతపరీక్ష తేదీ :   డిసెంబర్ 7, 2018.

దరఖాస్తు విధానం :   ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు :   జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1500; ఎస్సీ, ఎస్టీలకు రూ.1200.

దరఖాస్తుకు చివరితేదీ :   అక్టోబర్ 29, 2018. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.aiimsexams.org


మరింత సమాచారం తెలుసుకోండి: