ఏపీ పబ్లిక్ కమిషన్ సర్వీస్ (ఏపీపీఎస్సీ ) ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సుమారు 22 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల కి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన లో అభ్యర్ధుల  విద్యార్హత , రిజర్వేషన్లు , వయస్సు తెలుపబడింది. వివరాలలోకి వెళ్తే...

Jobs

 


అర్హత: ఫుడ్ టెక్నాలజీ/డెయిరీ టెక్నాలజీ/బయో టెక్నాలజీ/ఆయిల్ టెక్నాలజీ/అగ్రికల్చర్ సైన్స్/వెటర్నరీ సెన్సైస్/బయో కెమిస్ట్రీ/మైక్రో బయాలజీలో డిగ్రీ లేదా కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ లేదా మెడిసిన్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: జులై 1, 2019 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ప్రధాన పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 7, 2019.

ఫీజు చెల్లింపు తేదీ: మార్చి 27, 2019.

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 28, 2019.

ప్రధాన పరీక్ష తేదీ: మే 22, 2019

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: