10th పాస్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం లభించింది.
కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉండే మల్టీ టాస్కింగ్ స్టాఫ్
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్
ద్వారా సుమారు 10 వేల ఉద్యోగాలు భర్తీ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. నెలకి సుమారు
రూ.20వేలకు పైగా వేతనం ఉంటంది.
విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణత/తత్సమానం
వేతనం: రూ.5,200-రూ.20,200 + గ్రేడ్ పే రూ.1800
వయసు: శాఖల వారీగా కొన్ని పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య, మరికొన్ని పోస్టులకు 18-27 ఏళ్ల మధ్య (2019 ఆగస్టు 1 నాటికి) ఉండాలి. రిజర్వేషన్
వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు
ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్ల
వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుం: రూ.100/-(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీజు
నుంచి మినహాయింపు ఉంది).
దరఖాస్తు విధానం: అన్లైన్లో
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 2019, మే 29
పరీక్ష కేంద్రాలు :
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
పేపర్ 1 పరీక్ష తేదీలు: 2019 ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 6 వరకు
పేపర్ 2 పరీక్ష తేది: 2019 నవంబర్ 17
మరిన్ని వివరాలకోసం
వెబ్సైట్: https://ssc.nic.in/