ఆర్థిక పరిస్థితి సహకరించక ప్రతిభ ఉన్న విద్యార్థులు పై చదువులు చదవలేక ఈ మధ్యలోనే ఆపివేస్తున్నారు ఇలాంటి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్ షిప్ ద్వారా ప్రతిభ గల విద్యార్థులకు చేయూతనందిస్తోంది.


కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా విభాగం ఈ స్కాలర్ షిప్స్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరానికి జాతీయ స్కాలర్ షిప్ పోర్టలైన స్కాలర్ షిప్స్ డాట్ గౌట్ డాట్ ఇన్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది.


ఇందుకు సంబంధించిన వివరాలు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్లో ఉన్నాయి. స్కాలర్ షిప్పు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే రాష్ట్ర విద్యా మండలిలోని నోడల్ ఆఫీసర్ నుంచి సమాచారం తెలుసుకోవచ్చు.నోడల్ ఆఫీసర్ల వివరాలు కూడా నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ లో సర్వీసెస్ సెక్షన్ లో ఉంటాయి. మొదటి సారి స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసే వాళ్లు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సరైన వివరాలతో రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది.


పద్దెనిమిది ఏళ్ళలోపు విద్యార్థులైతే వారి తల్లిదండ్రులు ఈ ఫామ్ నింపాలి, స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్ రోల్ మెంట్ ఐడీ లేదా బోనఫైడ్ లేదా బ్యాంక్ పాస్ బుక్ కాపీలు అన్నీ సిద్ధంగా ఉంచుకుని దరఖాస్తుకు అప్లై చేయాలి దరఖాస్తు చేయటానికి రెండు వేల పంతొమ్మిది అక్టోబరు ముప్పై ఒకటి చివరి తేదీ.


మరింత సమాచారం తెలుసుకోండి: