వెనుకబడిన తరగతుల వసతిలో 3వ తరగతి చదువుతున్న బాలుడి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన చల్లపల్లి బీసీ హాస్టల్ లో చోటు చేసుకుంటుంది. ఈ హాస్టల్లో  చదువుకుంటున్న దాసరి ఆదిత్య హత్యకు గురికావడం సంచలనం రేకెత్తిస్తోంది. హాస్టల్ బాత్ రూమ్ లో ఆదిత్యను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. దాసరి రవి, ఆదిలక్ష్మి దంపతులకు మొత్తం నలుగురు సంతానం.  అందులో  ఇద్దరు ఆడపిల్లలు కాగా మరో ఇద్దరు మగపిల్లలు. వారిలో చివరి సంతానమైన  దాసరి ఆదిత్య(11) 3 వ తరగతి చదువుతున్నాడు.  ఇల్లుకి రెండు కిలోమీటర్ల దూరంలో బీసీ వసతి గృహం ఉంది.

ఆ హాస్టల్ లో ఆదిత్య అతని సోదరుడు అశోక్ ఇరువురు వసతి పొందుతున్నారు. వసతి గృహంలోని కింద రూమ్ లో పడుకున్న ఆదిత్య రాత్రి పైకి ఎందుకు వచ్చాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తెల్లారే సరికి బాత్ రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆ బాత్ రూమ్ కి డోర్ లేదు. ఈ ఘటనపై  హాస్టల్ వాచ్ మెన్ నాగబాబును పోలీసులు విచారిస్తున్నారు. మిస్టరీగా ఉన్న సఞఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వార్డెన్ వార్డెన్ రాత్రి ఇక్కడ లేడు. ఉదయాన్నే పిల్లలను 5 గంటలకు నిద్రలేపిన వాచ్ మెన్ కి ఆదిత్య కనిపించడం లేదు అని చెప్పారు.

ఇంటికి వెళ్ళాడేమో కనుక్కోమని అతని అన్నయ్య అశోక్ ని,మరో విద్యార్థిని ఇంటికి పంపారు. ఇంతలో బాత్ రూమ్ లో విద్యార్థి రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడని చెప్పగా పైకి పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్ కి తీసుకుని వెల్దామని బాత్ రూమ్ నుండి బయటకు తీసుకుని వచ్చారు. ప్రాణం లేకపోయెప్పటికి బయట వదిలేసి పోలీసులకు సమాచారం తెలిపారు.వెళ్దామని కింద రూమ్ లో అందరితో పడుకోవాల్సిన విద్యార్థి పైకి ఎందుకు వెళ్ళాడు అనేది మిస్టరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: