స్కూల్ వ్యాన్ లోయలో పడి అందులో ప్రయాణిస్తున్న 8 మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారు. విషాదకరమైన ఈ సంఘటన ఉత్తరాఖండ్ లో   చోటు చేసుకుంది. మంగళవారం ఈ దుర్ఘటన తెహ్రీ గర్హ్వాల్ లోని కంగ్సాలి గ్రామ సమీపంలో జరిగింది. బస్సులో మొత్తం 18 పిల్లలు ప్రయాణిస్తున్నారు.

డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై నుంచి దూసుకెళ్లి లోయలో పడింది.ప్రమాదంలో ఎనిమిది మరణించినట్లు పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ అజయ్ రౌటేలా ధృవీకరించారు.గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాగా మరో ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 22 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం ఉన్నావ్ జిల్లాలో ఆగ్రా - లక్నో ఎక్స్ ప్రెస్ వేపై జరిగింది.  బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: