ఏపీ దక్షిణ మండలి విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కం పరిధిలో సుమారు ఎనిమిది జిల్లాలకి గాను గ్రామ , వార్డు సచివాలయాలలో    5107జూనియర్ లైన్మెన్ గ్రేడ్ -2 పోస్టులకి అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులకి ఆహ్వానిస్తోంది. దీనిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలకి సుమారు 684 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 Image result for APSPDCL

ఏపీఎస్పీడీసీఎల్ సర్కిల్స్ వారీగా ఖాళీలు పరిశీలిస్తే..

విజయవాడ –   637

గుంటూరు   -   632

ఒంగోల్      -    641

నెల్లూరు     -    577

తిరుపతి     -   684

కడప         -   611

కర్నూల్      -   658

అనంతపూర్  -  667

 

అర్హత :  పదో తరగతితో పాటుగా సంభందిత ట్రేడ్ లో ఐటీఐ ఇంటర్ వొకేషనల్ ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకి పురుషులు మాత్రమే అర్హులు..

 

వయస్సు : 2019 ఆగస్టు సమయానికి 18 – 35 ఏళ్ళ మద్య వయసు ఉండాలి. SC, ST,BC అభ్యర్దులకి అయిదేళ్ళు గరిష్ట వయో పరిమితి సడలింపు ఉంటుంది.

 

ఎంపిక విధానం :  అకడమిక్ మెరిట్ ,పోల్ ఎక్కడం, మీటర్ రీడింగ్, సైక్లింగ్ టెస్ట్ ల ఆధారంగా ఎంపిక చేపడుతారు.             

దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో

దరఖాస్తు ఫీజు :    రూ 200

దరఖాస్తు చివరితేదీ  : ఆగస్టు 17, 2019

 మరిన్ని వివరాలకై  :   www.apspdcl.in     


మరింత సమాచారం తెలుసుకోండి: