స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
తాజాగా ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో భాగంగా సుమారు 477 స్పెషలిస్ట్
కేడర్ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగ కొలువులలో పోటీ పడే
నిరుద్యోగులు, అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన SBI లో ఉద్యోగాలు సాధించాలని
కోరుకుంటూ ఉంటారు. అయితే ఐటీ ఆధారిత పోస్టులుగా ఉన్న ఈ తాజా ప్రకటన ఇంజనీరింగ్
కోర్సులు చేసిన వారికి ఎంతగానో ఉపయోగ పడుతాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి
వెళ్తే..
మొత్తం పోస్టులు : 477
పోస్టుల సంఖ్య : డెవలప్పర్, నెట్ వర్క్ ఇంజనీర్ , టెస్టర్ , యూ ఎక్స్ డిజైనర్ , క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ , డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఐటీ రిస్క్ మేనేజర్
అర్హత : సంభందిత సబ్జెక్ట్ లలో డిగ్రీ , ఎంసీఏ , ఎమ్మేస్సే ఐటీ. ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. అనుభవం కూడా ఉండాలి
ఎంపిక విధానం : ఆన్లైన్ లో పరీక్ష, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది
దరఖాస్తు విధానం : ఆన్లైన్
చివరి తేదీ : 25-09-2019
పరీక్ష తేదీ : 20 -10-2019
మరిన్ని వివరాలకి : www.sbi.co.in