ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా డిగ్రీ కామన్ అయ్యింది. కానీ ఏవో కారణాల వల్ల డిగ్రీ చదవలేకపోయినా ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఇప్పుడు లభిస్తోంది. హైదరాబాద్ నగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ అందుకు అవకాశం కల్పిస్తోంది. జీహెచ్ఎంసీ,మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ ఉద్యోగాల కోసం మేళా నిర్వహిస్తున్నాయి.


సోమవారం ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు మూసాపేట ఉపకమిషనర్ మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసాపేటలోని కూకటపల్లి, మూసాపేట సర్కిళ్ల కార్యాలయాలలో ఈ మేళా జరుగుతుందన్నారు.


ఇంతకీ ఉద్యోగం ఏంటో చెప్పలేదు కదూ.. అసిస్టెంట్ సేల్స్ మెన్ ఉద్యోగం. కాకపోతే ఈ ఉద్యోగం లో కాస్త తిరగాల్సి ఉంటుంది. పదో తరగతి పాస్ అయితే చాలు.. ఆ పైన చదివినవారు కూడా నేరుగా ఇంటర్వ్యూకు రావచ్చు. వయస్సు మాత్రం 19-30 ఏళ్ల మధ్య ఉండాలి.


ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి నెలకు రూ. 11,190 వేతనం, టీఏ, డీఏ అదనంగా ఇస్తారు. ఆసక్తి కలిగినవారు తమ విద్యార్హత ధ్రువపత్రాల నకళ్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఇతర వివరాలకు కోసం 8008535309లో సంప్రదించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: