బంగారం ధర.. ఎంత దారుణంగా పెరిగిపోయింది అంటే.. మధ్యతరగతి వారికీ అందనంత ఎత్తులో బంగారం ధరలు పెరిగిపోయాయి. భారతీయులకు ఎంత ఇష్టమైన బంగారం అయితే మాత్రం అంత దారుణంగా పెరిగిపోతే ఎవరు కొనగలరు. భారత్ లో దాదాపు 60 శాతం మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. వారు ఎలా కొంటారు?

 

ఈ నేపథ్యంలోనే నేడు ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయిల పెరుగుదలతో 40,690 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 200 రూపాయిల పెరుగుదలతో 37,300 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర 250 రూపాయిలు భారీ పెరుగుదలతో నేడు 49,350 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా పెరగటంతో బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

 

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 1,467.85 డాలర్లకు పుంజుకుంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇలా బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ పోతే మనం కొనగలుగుతామా ? అనే సందేహం వస్తుంది. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: