బంగారం ధరలు.. రోజు రోజు మరి దారుణం అవుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతాయి. ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గుతాయి. ఇలా రోజు పెరుగుతూ తగ్గుతూ ఉండే బంగారం ఈ మధ్యకాలంలో దారుణంగా తయారు అయ్యింది. ఒకసారి 20 రూపాయిలు బంగారం తగ్గితే మరుసటి రోజు 200 రూపాయిలు పెరుగుతుంది. గత వారం నుండి బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఈ వార్త పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అయినప్పటికీ చదవగానే కోపం పీకల దాక వస్తుంది.. ఎందుకో చుడండి!

 

నేడు శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 30 రూపాయిల తగ్గుదలతో 40,720 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30 రూపాయిల తగ్గుదలతో 37,320 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. 

 

దీంతో కేజీ వెండి ధర 49,350 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి.

 

విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పసిడి ప్రేమికులు బంగారం కావాల్సినంత కొంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: