మధ్య తరగతి వారు కొనలేని స్థితికి బంగారం ధరలు పెరిగిపోయాయి. రోజురోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ బంగారం ధరల ఎంత పెరిగిపోయాయి అంటే సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరిగిపోయాయి. భారతీయులకు ఎంతో ఇష్టమైన బంగారం అయితే మాత్రం ఇంత దారుణంగా పెరిగితే ఎవరు  కొనగలరు.  

 

మాములుగా ఒకరోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో అయితే తగ్గింది ఒక ఇంత అయితే పెరిగేది మళ్ళి రెండింతలు. ఆలా పెరిగే వరుకు వెనకడుగు వెయ్యటం లేదు బంగారం ధర. ఈ నేపథ్యంలోనే నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 390 రూపాయిల పెరుగుదలతో 42,770 రూపాయలకు చేరింది. 

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 390 రూపాయిల పెరుగుదలతో 38,320 రూపాయలకు చేరింది. అయితే ఈ బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా అదే భాటలో నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర 200 రూపాయిలు పెరుగుదలతో 49,600 రూపాయిల వద్దకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా పెరగటంతో బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

 

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 1,467.85 డాలర్లకు పుంజుకుంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: