బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఎప్పుడు పెరుగుతూ తగ్గుతూ ఉండే ఈ బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. సాధారణంగా మన భారత్ లో పసిడి ప్రియులు ఎక్కువ.. వారికీ పసిడిపై ఉండే మమకారం మారె దానిపై ఉండదు. అయితే ఇప్పుడు ఆ మమకారాన్ని అంత చంపుకోవాల్సి వస్తుంది.. కారణం బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 

 

ఈ నేపథ్యంలోనే నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 50 రూపాయిల పెరుగుదలతో 41,660 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయిల పెరుగుదలతో 38,190 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర అదే బాట పట్టింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 50 రూపాయిల పెరుగుదలతో 49,650 రూపాయిల వద్దకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. సామాన్యులకు అందనంత దూరంలో ప్రస్తుతం బంగారం ధరలు చేరాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: