గత రెండు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలకు నేడు బ్రేక్ పడింది. ఎప్పటికప్పుడు తగ్గినట్టు కనిపిస్తూ భారీగా పెరుగుతున్న బంగారం నేడు కూడా మళ్లీ భారీగా పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర సామాన్యులకు బహు దూరం అయ్యింది అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం ధరలు సామాన్యులకు అనుకూలంగా లేవు.. భారీగా పెరిగాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయిల పెరుగుదలతో 42,390 రూపాయలకు చేరింది. ఇక 24 క్యరెట్ల బంగారం ధర 240 రూపాయిల పెరుగుదలతో 38,880 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 200 రూపాయిలు పెరుగుదలతో 49,000 రూపాయలకు చేరింది. ఇంకా ఢిల్లీ మార్కెట్ లోను బంగారం ధరలు అలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగడంతోనే బంగారం ధరలు భారీగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి అలాంటి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: